రావూరి భరద్వాజ

WhatsApp ద్వారా:12-3-2023అందుకున్నది
భరద్వాజ మహర్షి నీకు వందనం 🙏🙏🌹🌹
*” జ్ఞానపీఠం “అధిరోహించిన రావూరి భరద్వాజ “!!
పాత పుస్తకాలు తిరగేస్తుంటే ‘ రావూరి భరద్వాజ ‘ గారు గుర్తొచ్చారు.
భరద్వాజ గారి గురించి ఏం చెప్పాలి.ఆయన ..”జ్ఞాన పీఠ “పురస్కారాన్ని
అందుకున్న ఓ సామాన్యుడు,నిరాడంబరుడు, సాహితీ వేత్త…!

‌మన లోకం తీరేమంటే…మన కళ్ళముందే వుంటున్నా,రోజూ మనతో
తిరుగుతున్నా,మాట్లాడుతున్నా…ఆ వ్యక్తిలోని గొప్పతనాన్ని మనం గుర్తించం.
అది అదే వ్యక్తికి ఏదో ఒక ‘గొప్ప పురస్కారం ‘ వచ్చిందనుకోండి …ఇక
ఆ మనిషికి బ్రహ్మ రథం పడతాం.! ‘ఇంతోడు..అంతోడు ‘ అంటూ ఉన్నవీలేనివీ
కలిపి ఆకాశానికిఎత్తేస్తాం.

రావూరి భరద్వాజ గారిది కూడా సరిగ్గా …ఇలాంటి పరిస్థితే. రచయితగా నవలలు,
కథలు రాసినప్పుడు ఆయన్ను అంతగా పట్టించుకోని జనం ..జ్ఞానపీఠ ‘ పురస్కార
ప్రకటన రాగానే ఆయనింటికి ‘ క్యూ ‘కట్టారు..ఇది నా స్వానుభవంతో చెబుతున్న
విషయం. నేనే ప్రత్యక్షసాక్షి. (ఓ పత్రిక కోసం అప్పుడు నేను ‌కూడా భరద్వాజ గారి
ఇంటికెళ్ళి ఇంటర్యూ చేశాను)

భరద్వాజగారితో నాకు సాహిత్య బంధం కంటే,వ్యక్తిగత బంధమే ఎక్కువ. నేను
ఈనాడులో వున్నప్పుడు వాళ్ళబ్బాయి రావూరి కోటేశ్వర రావు ఫొటోగ్రాఫర్ గా
పనిచేసేవాడు. న్యూస్ కవరేజ్ కు ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం.అలా కోటేశ్వరరావు
నాకు కొలీగ్ గానే కాదు, మంచి స్నేహితుడయ్యాడు. ‌ ఎప్పుడైనా భరద్వాజ గారు
కొడుకు ను చూడటానికి ఈనాడుకు వచ్చేవారు.అప్పుడు పెద్దాయనతోమాటా
మంతీ జరిగేది.అలా భరద్వాజగారితో నాకు పరిచయం కలిగింది.సాన్నిహిత్యం
ఏర్పడింది.

భరద్వాజ గారు అంతోడు,ఇంతోడు అని నేను ప్రత్యేకంగాచెప్పాల్సినపనిలేదు.
ఆయన జ్ఞానపీఠి,జగమెరిగిన సాహితీవేత్త.భరద్వాజగారి బయోడేటా.,ఆయన
రాసిన పుస్తకాల వివరాల్ని నేనిక్కడప్రస్తావించడం లేదు. చలం గారితో భరద్వాజ
గారికి వున్న సంబంధ బాంధవ్యం గురించి మాత్రమేఇక్కడ చెబుతున్నాను.(ఈ
వ్యాస పరిథి అంతవరకే )

గుడిపాటి వెంకట చలం గారి రచనలంటే భరద్వాజ గారికి ఎంతో ఇష్టం.నూనూగు
మీసాల నూత్నయవ్వనంలో చలం ప్రభావంతో భరద్వాజ గారు పుంఖాను
పుంఖాలుగా బూతు రచనలు చేశారు .చలం గారితో పరిచయం పెంచుకున్నారు.
తొందరగానే వారిద్దరి మధ్య సాహితీ బంధం బలపడింది.
భరద్వాజ గారు రాసిన తొలి పుస్తకం..”రాగిణి “ (1950) కి చలం గారు ముందు
మాట రాశారు.(అచ్చయిన ఆయన తొలి కథ మాత్రంవిమల“(1946ఆగస్టు,ప్రజామిత్ర ).

*చలం గారి కథను తిప్పి పంపిన భరద్వాజ !!

భరద్వాజ గారు తెనాలిలో ఓ పత్రికలోపనిచేస్తున్నప్పుడు ‘మన భరద్వాజ వున్నాడు
కదా ‘ అని చలం గారు ఓ కథను ప్రచురణకోసం పంపారు.అయితే చలం కథను
తిప్పి పంపాడు. చలంగారి కథలో వైవిధ్యంలేక పోవడమే అందుకు కారణం. తన
కథను ప్రచురించకుండా తిప్పి పంపినందుకు చలంగారు ఏమాత్రంకోపగించుకోలేదట.
అప్పట్లో భరద్వాజ గారు రచనల్లో బూతుల్ని గుప్పించినా, “బాగుందయ్యా
భరద్వాజ “అంటూ చలం గారు మెచ్చుకునేవారట.

భరద్వాజ గారు చలం సాహిత్యాన్ని విస్తృతంగా చదివారు దాంతో చలం భావాలు,
ఐడియలజీ ఆయనకు బాగానే ఒంటబట్టాయి.ఓ దశలో చలం శైలిని అచ్చుగుద్దినట్లు
అనుకరించారు.. భరద్వాజదీనివల్ల చలం గారి రచనలకు, భరద్వాజ రచనలకు మధ్య
భేదం కనుక్కోవడం కూడా కష్టమయ్యేదట.అయితే ఆతర్వాత భరద్వాజ గారు
క్రమంగా చలం ప్రభావం నుండి బయటపడ్డారు అది వేరేసంగతి.

*చలంగారిని విభేదించిన భరద్వాజ !!

ఓ రకంగా చలంగారితో భరద్వాజ గారు ‘డిఫర్ ‘అయ్యారనే చెప్పొచ్చు.దీనికి ప్రధాన
కారణం‘వేశ్యావృత్తిలో “ స్వేఛ్ఛ”ను గురించి చలంగారు వర్ణించిన తీరుకు,లోకంలోని
వాస్తవిక పరిస్థికి మధ్య ఎంతో అంతరాయంవుందని భరద్వాజ గుర్తించారు.చలం గారి
మాటలకు,లోకంలోని పోకడలకు మధ్య ఏమాత్రం సామీప్యత లేదన్నది భరద్వాజ గారి
అబ్జర్వేషన్.బహుశా అప్పటి నుండే చలంగారి భావజాలంతో ఎడంగా…జరిగారు భరద్వాజ.
సెక్స్,బూతు వంటి భ్రమలుబలహీనతల నుండి బయట పడి భరద్వాజ
సామాజిక స్పృహనుఅలవర్చుకొని రచనలు చేశాడు.

ఆయన రాసిన “పాకుడు రాళ్ళు” (1965) నవలకు దేశంలో అత్యున్నత ‘జ్ఞానపీఠం’
పురస్కారం (2012 ) లభించింది.సినీ రంగంలోని స్త్రీల కష్టాల్ని వున్నదున్నట్లుగా
వర్ణించిన నవల ఇది.వాస్తవానికి చాలా దగ్గరగా రాశారు. భరద్వాజ.(,1965లో
కృష్ణాపత్రికలో ధారావాహికంగా వచ్చింది ) ‘జీవనసమరం ‘పేరుతో ఈనాడు
దిన పత్రికలో భరద్వాజ గారు రాసిన సామాన్యుల బతుకులకు విశేషాదరణ లభిం
చింది.“దైవరాజకీయాలు “కథకు స్వర్ణకంకణం”లభించింది. 1968,1983
సంవత్సరాల్లో సాహిత్య అకాడమీఅవార్డులుదక్కాయి.1987లో సోవియట్
ల్యాండ్ నెహ్రు అవార్డ్ ను అందుకున్నారు.మూడు విశ్వవిద్యాలయాలు
గౌరవ డాక్టరేట్ తో సమ్మానించాయి.నాలుగు విశ్వవిద్యాలయాల్లో పిహెచ్ డి
స్థాయిపరిశోథనలుజరిగాయి.వీరి రచనలుఇంగ్లీషు,హిందీ,తమిళ,మలయాళ
తదితర భాషల్లోకి అనువాదమయ్యాయి.

పొట్టకూటికోసం ,వ్వసాయ కూలీగా,పశువుల కాపరిగా,రంపం లాగే పనివాడిగా,
తిత్తులూదే కూలీగా,పేపర్ బాయ్ గా,చిన్న పత్రికల్లో ఉపసంపాదకుడిగా పనిచేశారు
.దుర్భర దారిద్ర్యం అనుభవించారు.‌ ఓ సందర్భంలో ఆయనకుకళ్ళజోడు కొనుక్కునే
స్తోమత లేకపోతే,తెనాలిలో కనకం అనే ఓ వేశ్య ఆరోజుల్లో రూపాయిన్నర పెట్టి ఓ
కళ్ళజోడు కొనిచ్చింది.ఇలా పేదరికం వెంటాడినా ‘జీవన సమరం’లో ఆయన
నెగ్గారు.ఆయన జీవిత పాఠశాలలో నేర్చుకున్నఅనుభవ సారాన్నితన రచనల్లో
రంగరించారు..కాబట్టే “ జ్ఞానపీఠ “ ‌పురస్కారానికి అర్హులయ్యారు.!

17నవలలు,47కథలు బాలలకు,,11సాహిత్య గ్రంథాలు,33,సైన్స్ కథలు
రాశారు.భార్య మరణానంతరం రాసిన ఎలిజీ “నాలోని నువ్వు “ఇంకా చిన్న కథలు
అవీ ఇవీ అన్నీకలుపుకుంటే సాహిత్య సాగరమే అవుతుంది..!
భరద్వాజ ఏం రాసినా (చలం ప్రభావం నుంచి బయట పడ్డాక ) సామాజిక స్పృహ
తోనే రాశారు.సమాజంలోని కష్టాలను,బాధల్నిఅక్షరీకరించారు.ఒకవేళ చలం
భావజాలంరచనల సారం నుండి బయట పడకుండా వున్నట్లయితే “బూతుల
భరద్వాజ”గానే మిగిలిపోయేవారేమో? ఇలా జ్ఞానపీఠాన్ని అధిరోహించే ఛాన్స్
కూడా మిస్సయ్యేదేమో?‌ ఏమో? ఎవరు చెప్పొచ్చారు.?

కేవలం బూతే …కాదండోయ్..”.నాణేనికి రెండో పక్కలా “ తన రచనలకు
సామాజిక స్పృహ కూడా వుందని భరద్వాజ గారురుజువు చేశారు.చలంగారి
‘ మత్తు ‘ ఒదిలేదాకా భరద్వాజ “బూతు “ రచయితగానే వున్నారు.నిజానికి
చలం ప్రభావంలోనుంచి బయటకు రాకుండావున్నట్లయితే,భరద్వాజగారు
బూతు రచయితగానే మిగిలిపోయేవారేమో?!!
From whatsapp . Writer name not known.
Kesava Rao: 👏👏🙏🙏 నా 12వ యేట పాకుడురాళ్ళు చదివాను. భరద్వాజ
గారితో అంతకు ముందు పరిచయం లేకపోయినా నన్ను జర్నలిస్ట్ గా 1980లో
చూసి నాకు ఆకాశవాణిలో చదవడం తెలియదన్నా ఓ పుస్తకం ఇచ్చి అది చదివి
ఆ కథలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో చదివింపజేసారు. గడ్డంతో భీష్ముడు
వలె కనిపించేవారు. ఆప్యాయంగా పలకరించే వారు 🙏

About vskesavarao

I am a Telugu Journalist. I started career as a Journalist 1976 in Andhrapatrika Daily. I am one of the founder member in the Editorial Board of Andhra Bhoomi Illustrated Weekly after February 1977.Latter I worked in Venditera Film weekly. I joined in Chitrabhoomi Film Weekly during 1980 of Kakatiya Publications, Hyderabad. It's Publisher is Mr.D.Bheem Reddy. We brought Aadivaram a Socio Political weekly &and Mayuri Illustrated weekly from this Organisation. I worked for this organisation in Hyderabad &and Madras upto 1983. Later I Joined in EENADU daily and worked until April 1984. Then joined again in Chitrabhoomi. Afterwards ie., during 1986 I joined in Andhraprabha daily in Hyderabad. Madras edition started after a long time and I was sent to Madras., Hyderabad as my headquarters.I worked for Vijayachitra a Film Monthly & Film Tradeguide weekly in Madras until1994.Afterwards I came to Hyderabad and joined in Andhraprabha telugu Daily. Now I am Editor in Charge for Chitraprabha a Thursday Film suppliment of Andhraprabha Daily from 2007.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s